టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో
విజయ్ (Vijay) నటించిన చిత్రం వారిసు. తెలుగులో వారసుడుగా వస్తోంది. కాగా తమిళ వెర్షన్ ఇవాళ తమిళనాడులోని థియేటర్లలో సందడి చేస్తోంది. వారిసు బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.
విజయ్ చాలా కాలం తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేస్కుంటున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా వారిసులో ఊహించని ఎలిమెంట్ ఒకటి అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఉంటుందని తెలిసిందే. అయితే సినిమాలో మాత్రం ఖుష్బూ లేదట. షూటింగ్ లొకేషన్ నుంచి ఖుష్బూ, రష్మిక, విజయ్కు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
కానీ ఇలా ఎవరూ ఊహించని విధంగా సినిమాలో ఖుష్బూ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైనట్టు కోలీవుడ్ సర్కిల్లో చర్చ జోరుగా నడుస్తోంది. అయితే ఖుష్బూ సీన్లు ఎందుకు తొలగించారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దీనిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.
ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. వారసుడు (వారిసు తెలుగు వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.