స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సలార్’. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న వరదరాజ మన్నార్ క్యారెక్టర్ లుక్ను విడుదల చేశారు. ఈ ప్రతినాయక పాత్ర హీరోకు ధీటుగా ఉంటుందని, ఈ రెండు పాత్రల మధ్య సాగే డ్రామా ఆకట్టుకుంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ..‘పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరో మా చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. వరదరాజ మన్నార్ పాత్రకు ఆయన కంటే బాగా ఎవరూ సరిపోరు. ఈ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ నటించిన తీరు మెప్పిస్తుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి’ అన్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.