సన్నీ కునాల్, వివా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించారు. శ్రీరామ దత్తి నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ..మంచి కుటుంబ కథా చిత్రమిదని, ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ తరహా కథాంశాల అవసరం ఉందన్నారు.
సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఓ కుటుంబ సంఘర్షణను ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించామని హీరో సన్నీ కునాల్ అన్నారు. చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.