టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్-ఎన్టీఆర్. ఈ ఇద్దరూ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించనున్నారు.
అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? అని అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశి క్లారిటీ ఇచ్చారు.
జెర్సీ చిత్రం నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నాగవంశి మాట్లాడుతూ..ఏప్రిల్ చివరలో లేదా మే మొదటి వారంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తనున్నట్టు చెప్పారు.
ఈ ప్రాజెక్టు ప్రీ పొడ్రక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
ఎన్టీఆర్-తారక్ కాంబోలో ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవ చిత్రం రాగా సూపర్ హిట్గా నిలిచింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.