ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీలు అందరు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయంలో ఫౌం హౌజ్కి వెళ్లి అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ బాటలో నడవాలని అనుకుంటున్నాడు.
రీసెంట్గా ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తాహశిల్దార్ కార్యాలయంలో సందడి చేసిన విషయం తెలిసిందే. మండలంలోని గోపులారం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినందుకు శుక్రవారం నాడు ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందులో అందమైన ఫౌం హౌజ్ని నిర్మించుకొని అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తాడట.
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీంగా నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొరటాల సినిమా చేయనున్నాడు. ఇక బుల్లితెరపై ఎవరు కోటీశ్వరులు అనే షో చేస్తున్నాడు. ఆగస్ట్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.