Dragon | జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మొదట మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ను అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు చాలా ఎక్కువ రోజులు కాల్షీట్స్ కేటాయించాల్సి రావడం, దానివల్ల తన మిగతా మలయాళ ప్రాజెక్టులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో టోవినో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. అతడి పోషించే పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా నటించినట్లు తెలుస్తుంది. ‘జుబిలీ’, ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ వంటి వెబ్ సిరీస్లతో మెప్పించిన సిద్ధాంత్ గుప్తా ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రంలో సిద్ధాంత్ గుప్తా ‘బాబీ సర్కార్’ అనే పాత్రలో కనిపించబోతుండగా.. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ (ATC)కి ‘వజీర్’ (ముఖ్య సూత్రధారి)గా వ్యవహరించే ఈ క్యారెక్టర్, సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న ‘లూగర్’ అనే పాత్రకు సోదరుడిగా ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అత్యంత క్రూరమైన స్మగ్లింగ్ సిండికేట్ అసోసియేట్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్గా నటిస్తుండగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. బిజు మీనన్, ఖుష్బూ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ విజువల్ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.