NTR- NEEL | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డ్రాగన్ అనే టైటిల్తో ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేయడం మనం చూశాం. చివరిగా సలార్తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుండగా, ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.
కర్ణాటకలో ఎన్టీఆర్పై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాస్త గ్యాప్ దొరికిన కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలని ప్రశాంత్ నీల్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘డ్రాగన్ మూవీ షూటింగ్ బ్రేక్ టైంలో వీరు సందడి చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎప్పుడు సరదాగా ఉండే ఎన్టీఆర్ ఏదో జోక్ వేసినట్టు తెలుస్తుంది. ఆ జోక్కి ప్రతి ఒక్కరు తెగ నవ్వేస్తున్నారు.
‘డ్రాగన్’ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మిస్తున్నారు. చిత్రంలో కథానాయికగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుండగా, దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. వచ్చే ఏడాది జూన్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.