NTR-Koratala Siva Movie | సందేశాత్మక సినిమాలను తెరకెక్కిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. రైటర్గా సినీ కెరీర్ను ప్రారంభించిన శివ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించాడు. ఇప్పటివరకు ఫ్లాప్ చూడని దర్శకులలో శివ ఒకడు. ప్రభాస్, మహేష్బాబు, ఎన్టీఆర్లకు లైఫ్లో గుర్తుండి సినిమాలను ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రామ్చరణ్ కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్లను జరపడంలో బిజీగా ఉంది. ఇక శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్తో చేయనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్పై శివ మేజర్ అప్డేట్ను తెలిపాడు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న రెండవ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. మరోసారి ఈ కాంబో సెట్స్పైకి వెళ్ళడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను శివ వెల్లడించారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నామని, ఈ చిత్ర షూటింగ్ను జూన్లో ప్రారంభించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా ఆలీయాభట్ నటించనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఆలీయా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, మేకర్స్ మరో బాలీవుడ్ భామను వెతికే పనిలో ఉన్నారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేనితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై నందమూరీ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.