సాధారణంగా సినిమాలను ఎక్కువగా సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు (distributors) ప్రమోట్ చేస్తుంటారు. వారు వేయించే పోస్టర్లను చూసి థియేటర్లకు వస్తుంటారు జనాలు. పట్టణాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) అయితే వారి థియేటర్లకు బిజినెస్ జరిగేలా ప్రింట్, ప్రచార ఖర్చుల్ని భరిస్తారు. ఇక మల్టీప్లెక్స్లు అయితే థియేటర్లను కాకుండా..సినిమాలను మాత్రమే ప్రమోట్ చేస్తాయి. కానీ ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాజజీలను కాదని హైదరాబాద్లోని ఓ మల్టీప్లెక్స్ మాత్రం తమ థియేటర్కు వచ్చే ప్రతీ సెలబ్రిటీని ప్రమోషన్స్ కోసం వినియోగించుకుంటుంది. ఇంతకీ ఆ మల్టీప్లెక్స్ ఏంటనే కదా మీ డౌటు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas). ఎవరైనా పెద్ద సెలబ్రిటీ ఏఎంబీ మాల్కు సినిమా చూసేందుకొస్తే..ఆ సెలబ్రిటీ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరాలో బంధిస్తారు. అంతేకాదు ఆ సెలబ్రిటీని పుష్ప గుచ్చంతో గ్రాండ్గా వెల్కమ్ చెప్పి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తూ డిజిటల్ ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
Glimpses of #YoungTiger @tarak9999 at AMB Cinemas for #RRRmovie screening😁#RRR #MovieScreening #Screening #Celebrities #AMB #AMBCinemas pic.twitter.com/4N35E8x7dO
— AMB Cinemas (@amb_cinemas) March 27, 2022
ఇటీవలే ఎన్టీఆర్- ప్రణతి కపుల్, ఎన్టీఆర్ (NTR), సతీమణి ప్రణతి, కల్యాణ్ రామ్ (Kalyanram) ఫ్యామిలీతో కలిసి ఏఎంబీ మాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించారు. ఎప్పటిలాగే మల్టీప్లెక్స్ బృందం ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ సందర్శనకు సంబంధించిన విజువల్స్ ను కెమెరాలో బంధించారు. ఇపుడీ ఫొటోలు, వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మొత్తానికి తమ థియేటర్లను ప్రేక్షకులతో నింపేందుకు ఏఎంబీ చేస్తున్న డిజిటల్ స్ట్రాటజీ చాలా బాగుందంటున్నారు సినీ జనాలు.