NTR | టాలీవుడ్ యువహీరో నార్నే నితిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్, శివానీ అనే యువతిని వివాహం చేసుకున్నారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్ కుటుంబం ఎంట్రీ ఇచ్చిన వేళ హౌస్ ఫుల్ హంగామా నెలకొంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారి నెట్టింట సందడి చేస్తున్నాయి.
వధువు శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ కావడం విశేషం. ఈ బంధం వలననే సినీ-పాలిటికల్ వర్గాల్లో పెళ్లి వేడుకపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 2023 నవంబర్ 3న నార్నే నితిన్, శివానీల నిశ్చితార్థం హైదరాబాద్లో జరగగా, ఇప్పుడు అక్టోబర్ 10న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ దంపతులతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, ఇతర సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నార్నే నితిన్ 2023లో “మ్యాడ్” సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచే ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్తో అభిమానులను మెప్పించాడు. అనంతరం “ఆయ్”, “మాడ్ స్క్వేర్” సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించి ప్రామిసింగ్ యాక్టర్గా నిలిచాడు. ఇటీవలే “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం నార్నె నితిన్- శివానీల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నార్నే నితిన్, శివానీల జోడికి సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు చేస్తున్నారు.మరోవైపు #NarneNithinWedding అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది!