దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు. ఆమె ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని విదేశాల్లోని తమ బంధువులకు కూడా తెలియజేశారు .