లాక్ డౌన్ తర్వాత హిందీ చలన చిత్ర పరిశ్రమ (Bollywood) నుంచి ఒకటి, రెండు సినిమాలు మినహా చెప్పుకునేంతగా ఉత్తమ సినిమాలేమీ రాలేదని చెప్పాలి. ఓ వైపు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలుస్తుంటే..హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. వరుస ఫ్లాఫులు బాలీవుడ్ (Hindi flops)లోని కొంతమంది జనాలని ఆందోళనకు గురిచేస్తుందన్న టాక్ ఇపుడు జోరుగా వినిపిస్తోంది.
దక్షిణాది చిత్రాలకు హైప్ క్రియేట్ చేయడం, హిందీ సినిమాల (Hindi films) పని అయిపోయిందనడం బీటౌన్ సెలబ్రిటీలకు బాధించే విషయం. ఇదే విషయమై స్టార్ హీరోయిన్ అలియా భట్ మీడియాతో మాట్లాడుతూ..హిందీ సినిమాల పట్ల మీడియా సానుభూతితో వ్యవహరించాలని, వాటిని చెత్తబుట్టలో వేయవద్దని కోరింది. ఇది కేవలం ఒక దశ మాత్రమే.
స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు వచ్చి ఒక్కసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే..మళ్లీ అన్నీ సర్దుకుంటాయని చెప్పుకొచ్చింది. అలియాభట్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్తో బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.