Siddharth Malhotra | బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ‘మిషన్ మజ్ఞు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెల 20న ఓటీటీలో విడుదలకానున్నది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కంటే ఎక్కువగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని పెళ్లిచేసుకోబోతన్నాడని వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి చేసుకుంటున్నారని, పెళ్లికి సన్నాహాలు ప్రారంభమైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
ఈ క్రమంలో ఎట్టకేలకు కియారాతో పెళ్లి వార్తలపై స్పందించాడు. ‘మిషన్ మజ్ఞు’ చిత్రం ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో కియారాతో పెళ్లి వార్తలను ఖండించాడు. పెళ్లి గురించి ప్రస్తావించగా.. ‘నన్ను ఎవరూ పెళ్లికి పిలువలేదు’ అని చెప్పాడు. గతంలోనూ రెండుస్లారు పెళ్లి వార్తలపై ప్రచారం జరిగినట్లు చెప్పాడు.
ప్రస్తుతం వ్యక్తిగత జీవితంపై కంటే.. సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలను పట్టించుకోనంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఎట్టకేలకు కియారాతో పెళ్లి ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. కియారా – సిద్ధార్థ్ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇటీవల కియారా బ్రైడల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పెళ్లి వార్తలకు ఆజ్యం పోసింది. కియారా ఓ యాడ్ కోసం పెళ్లి కూతురి దుస్తులు ధరించింది. ఆ తర్వాత పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.