పవన్కల్యాణ్-రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఎంపికైంది. అయితే పవన్ కల్యాణ్ కు జోడీగా నటించే హీరోయిన్ పైనే మొదటి నుంచి సస్పెన్స్ నెలకొంది.
డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇప్పటివరకున్న టాక్.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ మరో మలయాళం బ్యూటీ నిత్యమీనన్ను సంప్రదించారట.
సాయిపల్లవి తర్వాత ఆ పాత్రకు నిత్యమీనన్ అయితే సరైన న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యారట.
నిత్యమీనన్ కూడా పవన్కల్యాణ్ సతీమణిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు.