నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఏడు ఏపిపోడ్ల ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో ప్రసారం కానుంది.
ఈ సిరీస్ ట్రైలర్ను హీరో నాని ఆవిష్కరించారు. ఇందులో బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్యసాహసాలు మూర్తీభవించిన మహిళగా నిత్యామీనన్ కనిపించింది. ఈ తరానికి చెందిన ఆధునిక మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్ రానుంది.