Nithya Menen | హీరోయిన్ నిత్యామీనన్ను ఓ తమిళ నటుడు వేధించాడని వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ‘ఆ వార్తలన్నీ అవాస్తవం. నేను ఏ ఇంటర్వూలోనూ అలా చెప్పలేదు. ఈ రూమర్ క్రియేట్ చేసింది ఎవరో నాకు చెప్పండి.. ఇలాంటి పిచ్చి వార్తలను క్రియేట్ చేసేవారికి నేను పుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను. జర్నలిజంలో ఓ వర్గం ఇలా ఈ స్థాయికి దిగజారింది.. ఇంత కంటే కాస్త మంచి పనులు చేయండని నేను కోరుతున్నాను’ అని నిత్యా మీనన్ పోస్ట్ వేసింది. అంతేకాకుండా దొంగదొరికాడంటూ ఆ ఫేక్ వార్తలు సృష్టించిన వారి పోస్ట్లను ట్వీట్లో వేసింది.
It's very sad that certain sections of journalism have come down to this. I urge you – Be Better than this! 😊#stopfakenews @letscinema pic.twitter.com/zevdEPqTlL
— Nithya Menen (@MenenNithya) September 26, 2023
‘మనమంతా కొంత సమాయాన్ని గడిపేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ, ఇలా ఒకరిపై ఇంకొకరు తప్పుడు ప్రచారం చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవి ఆపేందుకు మాత్రమే నేను వీటిని ఎత్తి చూపుతున్నా’ అని ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిత్యా మీనన్ కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ చేస్తుంది. గురువారం నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్పై ఓటీటీ ప్రియుల్లో మంచి ఆసక్తే నెలకొంది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు ఫ్యామిలీ ఆడియెన్స్ను కట్టిపడేశాయి.
We are all here for such a short period of time . It always surprises me how much wrong we do to each other 🙂
I point this out today because only accountability stops bad behaviour
Be better humans @ursBuzzBasket@letscinema and all the others who have followed this bandwagon pic.twitter.com/qMfHM5dDgB— Nithya Menen (@MenenNithya) September 26, 2023
ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ విషయానికొస్తే.. తాము ఎంతో ఇష్టపడే పాత ఇల్లును నిత్యామీనన్ వాళ్ల బాబాయ్ అన్యాయంగా లాక్కుంటాడు. ఆ ఇల్లును దక్కించుకోవాలంటే 6 నెలలోగా వాళ్ల బాబాయ్కు 38లక్షలు కట్టాల్సివస్తుంది. నెలకు 13వేలు సంపాదించే నిత్యా.. ఆ ఇల్లును ఎలాగైన దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంత తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బులు కావాలంటే బార్ పెట్టడం కరెక్ట్ అని భావించి ఊర్లో బారును ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో చాలా ఫన్నీగా ఈ సిరీస్ను రూపొందించారు.