అలా మొదలైంది సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాతి కాలంలో తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. కట్ చేస్తే ఇపుడు పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా మ్యూజికల్ రియాలిటీ షోకు పనిచేయనుంది నిత్యమీనన్ (Nithya Menen). ఈ షో పేరును తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) అని నామకరణం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) ఓటీటీ రియాలిటీ షోకు జడ్జిగా రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మేకర్స్ విడుదల చేసిన లేటస్ట్ ప్రోమో ద్వారా ఈ షోకు మరో వ్యక్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారని స్పష్టమవుతోంది. ఆ వ్యక్తే నిత్యమీనన్. ఈ భామ నటి మాత్రమే కాదు, మంచి సింగర్ అని తెలిసిందే. తాజా ప్రోమో ద్వారా నిత్యమీనన్ ఇండియన్ ఐడల్ తెలుగు వెర్షన్ రెండో జడ్జిగా వ్యవహరించనుందని తెలిసిపోతుంది. పాపులర్ సింగర్ శ్రీరామ చంద్ర ఈ షోను హోస్ట్ చేయబోతున్నాడు
ఆహాలో అతి త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది. నిత్యమీనన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది.