నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎం.ఎస్.రాజశేఖర్రెడ్డి దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, రామ్మోహన్ కెమెరా స్విఛాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ‘అక్టోబర్లో చిత్రీకరణ మొదలుపెడతాం. శక్తివంతమైన యాక్షన్ అంశాలతో సాగే చిత్రమిది. నితిన్ పాత్ర చిత్రణ కొత్తపంథాలో ఉంటుంది. మాస్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది.’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సాహి సురేష్, లైన్ ప్రొడ్యూసర్: జి.హరి, సంగీతం: మహతి స్వరసాగర్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్రెడ్డి.