భీష్మ సినిమా తర్వాత నితిన్కు సక్సెస్లు కరువయ్యాయి. ఆయన ఇటీవల నటించిన రంగ్ దే, చెక్ రెండు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఇప్పుడు మ్యాస్ట్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంధాదున్ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయనున్నారు.
వరుస సినిమాలతో సందడి చేస్తున్న నితిన్ తాజగా తన 31వ సినిమాని ప్రారంభించాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారుతున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఇందులో నితిన్కి జంటగా నటిస్తోంది.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మణిశర్మ తనయుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించబోతున్నారు. నితిన్ కెరీర్లో 31వ చిత్రంగా తెరకెక్కబోతున్న దీని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభించబోతోంది. కాగా ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు మోషన్ పోస్టర్ అలాగే చిత్ర టైటిల్ను రివీల్ చేయనున్నారు. నితిన్ 31 అంటూ విడుదల చేసిన ప్రకటన పోస్టర్ అందరిను ఆకట్టుకుంటుంది.