Nithiin-venky kudumula | ‘అఆ!’ తర్వాత నితిన్ కెరీర్లో ఆ స్థాయిలో హిట్టయిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో రిలీజై బ్లాక్బస్టర్ విజయం సాధించింది. నితిన్ కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక వెంకీ కుడుముల టేకింగ్, పంచ్ డైలాగ్స్ సినిమాను బ్లాక్బస్టర్ హిట్చేశాయి. ఇదిలా ఉంటే ఈ కాంబోలో మరో సనిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెంకీ కుడుముల భీష్మ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే భీష్మ తర్వాత వెంకీ, చిరుతో సినిమా చేయాల్సిఉంది. కానీ చిరుకు ఫైనల్ నేరేషన్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది. ఈ క్రమంలో వెంకీ కుడుముల, నితిన్కు మరో కథను వినిపించాడట. నితిన్కు కూడా కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీని మైత్రీ సంస్థ నిర్మించనుందట.
ఇక ఇటీవలే నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా మిగిలింది. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆగస్టు 12న రిలీజై నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇక నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. మరి వక్కంతం వంశీతో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడా లేదా వెంకీ కుడుములతో చేస్తున్నాడా అని తెలియాల్సి ఉంది.