Nithiin next movie | యువ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించాడు. జయాపజయాలతో సంబంధంలేకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్కు జోడిగా ఉప్పెన బ్యూటి కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.ఈ చిత్రం తరువాత నితిన్ పలువురు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయబోతున్నాడు అని గాసిప్స్ వచ్చాయి. అయితే తాజాగా నితిన్ తన నెక్స్ట్ సినిమాను అల్లుఅర్జున్ డైరెక్టర్తో చేయబోతున్నట్లు సమాచారం.
‘నా పేరు సూర్య నా ఇల్లు’ ఇండియా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ రైటర్ వక్కంతం వంశీకి డెబ్యూ సినిమానే విఫలనాన్ని ఇచ్చింది. ఇక చాలా కాలం గ్యాప్ తరువాత వంశీ నితిన్తో తన రెండవ సినిమాను చేయనున్నాడు. ఈ సారి ఎలాగైనా బ్లాక్బస్టర్ సినిమాను తీయాలని వంశీ ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట. ఈ కథకు జూనియర్ అనే టేటిల్ను పరిశీలనలో ఉంచాడట. ఇక ఈ కథ పోకిరి తరహాలో యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని టాక్. ఈ చిత్రానికి టాగోర్ మధు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడు. గతంలో వక్కంత వంశీ, జూ. ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.