న్యూఢిల్లీ: నీతా అంబానీ(Nita Ambani) తన స్టయిలిష్ లుక్స్తో అట్రాక్ట్ చేస్తోంది. న్యూయార్క్లో జరిగిన మెట్ మ్యూజియం ఈవెంట్కు ఆమె బ్లాక్ కలర్ సారీలో వచ్చింది. చాలా ఎలిగెంట్ లుక్లో నీతా కూల్గా కనిపించింది. సాంప్రదాయక చీరలో ఆమె తన హుందాతనాన్ని ప్రదర్శించింది. ఫ్యాషన్ ప్రేమికులకు నీతా తన లుక్తో కొత్త జలక్ ఇచ్చింది. బ్యూటీఫుల్గా ఉన్న బ్లాక్ సారీని అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. బ్లాక్ జార్జెటీ చీరలో నీతా మెరిసిన తీరు హైలెట్. చాలా విన్రమంగా ఆ చీరలో ఆమె గ్లామరస్గా కనిపించారు. బ్లాక్ చీరకు సిల్క్ బోర్డర్ డిజైన్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా డెలికేట్గా ఉంది. ధగధగలాడుతున్న గోల్డ్ జర్దోజి నెమళ్లు ఆ బోర్డర్లో ప్రింట్ చేశారు. ఇక ఆ సారీ మీదకు నీతా అంబానీ ప్యూర్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. పెద్దగా మేకప్ లేకుండానే నీతా తన నీట్ లుక్ను ప్రజెంట్ చేశారు. ఆమె పెట్టుకున్న చెవి రింగులు కూడా మరో ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చేశాయి.
న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజింయంలో జరిగిన ట్రీ అండ్ సర్పెంట్.. ఎర్లీ బుద్దిస్ట్ ఆర్ట్ ఇన్ ఇంఇయా 200 బీసీ-400 సీఈ అన్న ప్రోగ్రామ్కు ఆమె హాజరైంది. నిజానికి సందర్భం ఏదైనా.. నీతా తన గ్రాండ్ డ్రెస్సింగ్తో అదరగొడుతుంది. ఆమె ఫ్యాషన్ స్టయిల్కు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. ఇటీవల భర్త ముఖేశ్ అంబానీతో కలిసి వైట్హౌజ్లో జరిగిన స్టేట్ డిన్నర్కు హాజరైంది. ఇక ఆ మెగా గ్యాదరింగ్ కోసం నీత ఐవరీ, గోల్డ్ కలిసిన బెనారస్ చీరను కట్టుకున్నది. ఆ లుక్లో నీతా చాలా అద్భుతంగా దర్శనమిచ్చింది. ఫంక్షన్ ఏదైనా నీతా తన సహజమైన అందాలతో ఆకట్టుకుంటుంది.