నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ, మలయా ళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘1945లో జరిగిన ప్లేన్ క్రాష్లో సుభాష్ చంద్రబోస్ ఆచూకిని కొల్పోయాం.
ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి పవర్ఫుల్ స్టోరీలో దాగి వున్న అనేక రహస్యాలను ఎంతో పరిశోధించి ‘స్పై’ కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రతీ సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులకు గూజ్బంప్స్ వచ్చే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. తప్పకుండా ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ‘స్పై’ ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.