యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం 18 పేజెస్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా, గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు కార్తికేయ2 చిత్రంతో కూడా బిజీగా ఉన్నాడు నిఖిల్. వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళుతున్న నిఖిల్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అనౌన్స్ చేశాడు. ‘హిట్’, ‘ఎవరు’ లాంటి థ్రిల్లర్ సినిమాలకు వర్క్ చేసిన ఎడిటర్ గ్యారీ బి హెచ్ డైరెక్టర్ గా నిఖిల్ తో ఓ సినిమాను చేస్తున్నాడు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిని ఒక స్పై థ్రిల్లర్ గా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుపుతున్నారు .ఈ చిత్రాన్ని రెడ్ సినిమాస్ బ్యానర్ పై కే రాజా శేఖర్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.