ప్రస్తుతం గూఢచార్య నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. హీరోయిజం, దేశభక్తి మిళితంగా సాగే ఈ కథల్లో నటించడానికి అగ్రహీరోలంతా ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా కెరీర్లో తొలిసారి హీరో నిఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంతో ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె.రాజశేఖర్రెడ్డి, చరణ్తేజ్ నిర్మాతలు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం అనౌన్స్మెంట్ పోస్టర్ను చిత్రబృందం విడుదలచేసింది. జాతీయ జెండాతో పాటు దేశ సరిహద్దులను చూపిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో నిఖిల్ గూఢచారిగా కనిపిస్తారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.