మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గత ఏడాది డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజులలో వీరు యానివర్సరీని జరుపుకోనున్నారు. ఈ క్రమంలో నిహారిక తన భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా చేసిన సాహసంతో నిహారిక స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది.
వివరాలలోకి వెళితే నిహారిక జంట గత కొద్ది రోజులుగా స్పెయిన్ రాజధాని బార్సిలోనాలోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించారు. ఆ తర్వాత స్కై డైవ్ చేసింది. ఎంతగానో భయపడుతూ మొత్తానికి పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ నేను చేసాను.. చాలా పారవశ్యంగా ఫీలవుతున్నా.. నా ఆపండ్రోయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసింది నిహారిక.
గగనతలంలో నుంచి భూమి మీదకి డైవ్ చేసిన తరవాత నిహారిక ఆనందం అంతా ఇంతా కాదు. మొత్తానికి ఒక కొత్త అనుభూతిని నిహారిక స్కైడైవింగ్ ద్వారా పొందింది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, అంజలి, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు స్కైడైవ్ చేశారు. బాలీవుడ్ నుంచి అయితే దీపికా పదుకొనె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఊర్వశి రౌతెలా తదితరులు స్కైడైవ్ను ఆస్వాదించారు.
https://www.instagram.com/tv/CXGCKzgj_BZ/?utm_source=ig_web_copy_link