ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే కావడంతో ఆ రోజు తెలుగు రాష్ట్రాలలో ఎంత సందడి నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలోను అభిమానుల హడావిడి ఓ రేంజ్లో ఉంది. ఆ రోజు మెగా ఫ్యామిలీ అంతా చిరు ఇంటికి వెళ్లి మెగా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు ఈ వేడుకలో పాల్గొనడంతో ఎంతో ఆ ఫ్రేమ్ ఎంతో కలర్ఫుల్గా కనిపించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, మెగాస్టార్ కొడుకు-కోడలు రామ్ చరణ్, ఉపాసన కామినేని, కూతుళ్లు సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ నిహారిక ఆమె భర్త హాజరయ్యారు. అలాగే అల్లు అరవింద్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 22న రాఖీ కూడా రావడంతో చిరంజీవి, పవన్, నాగబాబుకి వారి సోదరీమణులు రాఖీ కట్టారు.
ఇక రామ్ చరణ్, వరుణ్ తేజ్లకి నిహారిక, శ్రీజు,సుస్మితలు రాఖీ కట్టి ప్రేమను పంచుకున్నారు. అయితే పవన్ కుమారుడు అకీరా రాఖీ రోజు తన సోదరి ఆద్యతో రాఖీ కట్టించుకోగా, తర్వాతి రోజు నిహారిక దగ్గరకి వచ్చాడు.ఆమెతో రాఖీ కట్టించుకున్నాడు. అందుకు సంబంధించి ఓ ఫోటోని నిహారిక షేర్ చేయగా, అందులో తమ్ముడి ఫేస్ కనిపించకుండా సస్పెన్స్లో పెట్టింది. అతని హైట్, గెటప్ చూసి అకీరా అని అభిమానులు వెంటనే కనిపెట్టేశారు. తమ్ముడిని గట్టిగా హత్తుకొని నిహారిక దిగిన పిక్ ప్రస్తుతం వైరల్గా మారింది.