కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మృతితో ప్రతి ఒక్కరు శోక సంద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.ఆయన మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం పునీత్ రాజ్ కుమార్పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన సందేశాన్ని పెట్టారు.ఈ క్రమంలో ఆ యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ “ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది” అని తెలిపారు.
అయితే నిందితుడు తన ఇన్స్టాగ్రామ్లో బీర్ బాటిల్తో అవమానకరమైన పోస్ట్ను అప్లోడ్ చేయడం వలనే అరెస్టం చేసినట్టు తెలుస్తుంది. పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు బీర్ బీటిల్ చేతిలో పట్టుకొని రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర…..! అంటూ నీఛంగా వ్యాఖ్యలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి బెంగళూరు నగర పోలీసులను ట్యాగ్ చేయడం గమనార్హం.