మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) గత కొద్ది రోజులుగా గని షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి తన తండ్రి నాగబాబుని తీసుకొని దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క్రికెట్ ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేశారు. ఇక దుబాయ్ లో షాపింగ్, ఖరీదైన హోటల్స్ లో స్టే, ఫుడ్.. ఇలా మనసుకు నచ్చినట్లు నాగబాబు, వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే నిన్న జరిగిన మ్యాచ్లో భారత్(India) ఓటమిపై నాగబాబు(Naga Babu)ని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఓటమి అంటూ ఆంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.జనసేన పార్టీలో అడుగుపెట్టినప్పుడు ఆ పార్టీ ఓడింది. మా ఎన్నికలలో ప్రకాశ్ రాజ్కి సపోర్ట్ చేశావు, ఆయన ఓడిపోయారు. ఇండియా- పాక్ మ్యాచ్ చూడ్డానికి అక్కడ వెళ్లావు. మ్యాచ్ ఓడింది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమే అని ఓ రేంజ్ లో తగులుకున్నారు.
నాగబాబు ఇటీవలి కాలంలో కొన్ని దారుణమైన కామెంట్స్ చేసి నెగెటివిటీని బాగా పెంచుకున్నారు. ముఖ్యంగా కోటపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పద్దతిగా లేవని కొందరు మండిపడ్డ విషయం తెలిసిందే.