Neti Bharatam | సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటిభారతం’. ఒకే పాత్రతో ఈ సినిమా రూపొందటం విశేషం. భరత్ పారేపల్లి దర్శకుడు. డా.యర్రా శ్రీధర్రాజు నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు.
‘రాజకీయ వ్యవస్థవల్ల ప్రజలు అనుభవిస్తున్న అవస్థలను ఇందులో చూపించాం. శ్రీధర్రాజు పేషన్తో ఈ సినిమా చేశారు.’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్ చెప్పారు. ‘కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఈ సినిమా ఉంటుంది. ఇందులో నేను జర్నలిస్ట్గా కనిపిస్తాను. తెరపై హీరో నేనే అయినా, తెరవెనుక హీరో పారేపల్లి భరత్గారే.’ అని శ్రీధర్రాజు చెప్పారు. సినిమా విజయంపై దర్శకుడు పారేపల్లి భరత్ నమ్మకం వ్యక్తం చేశారు.