Neha Shetty | డీజే టిల్లు ఫేమ్, టాలీవుడ్ నటి నేహా శెట్టి నిర్మల్ పట్టణంలో సందడి చేసింది. నిర్మల్లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఇక ప్రారంభోత్సవం అనంతరం షాపింగ్మాల్లోని అన్ని ఫ్లోర్లు కలియ తిరుగుతూ తనదైన శైలిలో ప్రజలు, వినియోగదారులు, అభిమానులను నేహా శెట్టి ఆకట్టుకుంది. అయితే సినీతార నేహా శెట్టి చూసేందుకు యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేహా శెట్టి అభిమానులకు అభివాదం చేస్తూ ‘హలో నిర్మల్’ అంటూ ఉత్తేజాన్ని నింపారు. షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం చీరెలను తిలకించారు. నేహా శెట్టితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘టైసన్ నాయుడు సినిమాలో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటు విశ్వక్ సేన్తో నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.