హీరోయిన్ నేహాశెట్టి.. తన పేరుతో కంటే ‘డీజే టిల్లు రాధిక’గానే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా ఆమెపై చూపించిన ఇంపాక్ట్ అలావుంది మరి. ప్రస్తుతం అంతా నేహాని ‘రాధిక..’ అనే పిలుస్తున్నారు. యువతరంలో ఈ అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు. అంత క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం అరకొరగానే చేస్తున్నది నేహాశెట్టి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిందామె. ‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. నిజానికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. నేనే అంగీకరించడంలేదు. కథ, పాత్ర బాగుండకపోతే చేయను’ అని నిర్మొహమాటంగా చెప్పింది నేహా. ఇంకా చెబుతూ ‘ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి. గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలి. కేవలం డబ్బుకోసమే నేను హీరోయిన్ని కాలేదు. నాకంటూ కొన్ని లక్ష్యాలు, నియమాలు ఉన్నాయి. ఏదిపడితే అది చేసేసి కెరీర్ని పాడుచేసుకోవడం నాకిష్టంలేదు. కెరీర్కి లాంగ్విటీ ఉండాలంటే, చేసే పాత్రలు మంచివి అయ్యుండాలి. అయినా నేనేం ఖాళీగా లేను. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో 4 నెలలపాటు యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చాను. నటిగా నాకు నేను మెరుగుపరచుకునే పనిలోఉన్నాను. మార్చి 8న మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల కానుంది. అందులో నా పాత్ర పేరు బుజ్జి. తప్పకుండా అందర్నీ ఆకట్టుకునే పాత్ర అవుతుంది.’ అంటూ చెప్పుకొచ్చింది నేహాశెట్టి.