పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ రీమేక్గా తెరకెక్కుతున్న చిత్రానికి ఏ టైటిల్ పెడతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, కొద్ది సేపటి క్రితం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి భీమ్లా నాయక్ అనే టైటిల్ని చిత్రానికి ఫిక్స్ చేసినట్టు తెలిపారు.
ఈ గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా, దీనికి సాలిడ్ రెస్పాన్స్ తో పాటుగా చిన్న నెగిటివిటి కూడా స్టార్ట్ అయ్యింది. అందుకు కారణం మల్టీ స్టారర్ అయిన ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ పోస్టర్స్, వీడియోస్ తప్ప రానావి ఏవి విడుదల చేయకపోవడం. ఇది మల్టీ స్టారర్ చిత్రం కదా పవన్ ఒక్కడినే హైలైట్ చేసి చూపించడం ఏమిటి? అని విమర్శకులు ప్రశ్నలు సంధిస్తుండగా నిర్మాత బదులిచ్చారు.
దేనిపై కూడా ఒక ఫైనల్ డిసిషన్ కి రావొద్దు. ప్రతీది కూడా టైం ప్రకారం వస్తుంది అప్పడూ వరకు దయచేసి వేచి ఉండండి” అంటూ విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి థమన్ ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందిస్తుండగా ,సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఒరిజినల్ మూవీలో బిజూ మీనన్ నటించిన క్యారెక్టర్ని తెలుగులో పవన్ చేస్తుండగా, కోషి కురియన్గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తున్నారు.