వికాష్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకుడు. ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను నిర్మాత పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘చదువుకునే రోజుల్లో సినిమా తీయాలనే కల వుండేది. ఒక మంచి సినిమాతో నిర్మాతగా అడుగుపెట్టినందుకు ఆనందంగా వుంది.
ప్రస్తుతం చిత్రం నిర్మాణనంతర పనులు జరగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకమైన సినిమాను రూపొందించాం. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.