ముంబై: బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో లింకు ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్ డీలర్ షాహిల్ షాను అరెస్టు చేశారు. షాహిల్ షా అలియాస్ ఫ్లాకోగా డ్రగ్స్ అమ్మకాలు చేసేవాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే షాహిల్ కూడా ఉన్నాడు. అయితే గత 8 నెలల నుంచి అతను పరారీలో ఉన్నాడు. 2021 ఏప్రిల్లో ఎన్సీబీ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి వారి నుంచి మారిజునా స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుతోనూ షాహిల్కు లింకు ఉంది. ఈ రెండింటి కేసుల్ని పోలీసులు విచారించనున్నారు. సుశాంత్కు డ్రగ్ డీలర్ షాహిల్ మాదకద్రవ్యాలను అమ్మేవాడని ఎన్సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే గతంలో తెలిపారు. షాహిల్ షాపై గత ఆర్నెళ్ల నుంచి అనుమానం ఉందని, ఏప్రిల్ 13వ తేదీన మాల్దాలోని అతని ఇంట్లో సోదాలు చేశామని, అయితే సుశాంత్ ఉన్న కాంప్లెక్స్లోనే షాహిల్ ఉండేవాడని తేలినట్లు సమీర్ చెప్పారు. 2020, ఏప్రిల్ 14వ తేదీన బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ సింగ్ మృతిచెందిన విషయం తెలిసిందే.