నయనతార ప్రస్తుతం ‘అన్నపూరణి’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్లో శరవేగంగా జరుగుతున్నది. మరి ఆ పాత్ర ప్రభావమేమోగానీ రీసెంట్గా నయన్ ఓ బాలికల అనాధ శరణాలయాన్ని సందర్శించి, అక్కడున్న బాలికలందరికీ మంచి విందుభోజనాన్ని తన సొంత ఖర్చుతో అందించింది. తమ శరణాలయానికి నయన్ రావడంతో అక్కడున్న బాలికల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
వచ్చి అమాంతం నయన్ను హత్తుకుంటూ ముద్దులు పెట్టేస్తూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ ‘నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. జీవితంలో కొన్ని పనులు చేస్తే ఏదో తెలీని సంతృప్తి. వీళ్లందరూ నాపై చూపిస్తున్న అభిమానం వేలకోట్లతో కూడా వెలకట్టలేనిది. ఈ రోజు వీళ్లతోనే కలిసి భోంచేశాను. ఇక నుంచి ప్రతి ఏడాదీ ఓ రోజు వీళ్లకు కేటాయించాలనుకుంటున్నాను. ఇంకా వీళ్లకోసం ఏమైనా చేయాలి. త్వరలోనే నా నిర్ణయాన్ని చెబుతా’ అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చింది నయనతార.