షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ సినిమాకు అట్లీ కుమార్ దర్శకుడు. నయతార మాట్లాడుతూ…‘ఇన్నాళ్లూ సరైన అవకాశం రాకపోవడం వల్లే నేను హిందీలో సినిమా చేయలేదు. నిజం చెప్పాలంటే అప్పట్లో పరిస్థితులు ఇంత అనుకూలంగా లేవు. ఇప్పుడు కాలం మారింది. పాన్ ఇండియా మూవీ ట్రెండ్ వల్ల తమ సినిమాలు వివిధ భాషల్లో విడుదల చేసేందుకు తారలు ధైర్యం చేయగలుగుతున్నారు. ప్రతి దానికీ సరైన సమయం అంటూ ఉంటుంది. నా బాలీవుడ్ ఎంట్రీ కూడా సరైన సమయంలోనే జరుగుతుందని భావిస్తున్నా’ అని చెప్పింది.