ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. ఈ ఏడాది జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం జాతిరత్నాలు సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు నవీన్. యూఎస్ేలో హాలీడే వెకేషన్ ను సరదాగా గడుపుతున్నాడు.
ఈ రెండు సినిమాల సక్సెస్ వెనుక ఉన్నరహస్యమేంటో చెప్పుకొచ్చాడీ ఈ యువ హీరో. స్క్రిప్ట్ దశలో ఉన్నపుడు స్టోరీపై ఎక్కువ శ్రద్దపెట్టడమే విజయానికి కారణమని చెప్తున్నాడు. నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలకు స్క్రిప్ట్ పనులు కూడా చూసుకోవడం వల్లే..ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నాయని టాక్.
నవీన్ తన కొత్త చిత్రం అనుష్కతో కలిసి చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కించనుండగా..త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.