Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిని స్క్రీన్పై చూసి రెండేళ్లయ్యింది. జాతిరత్నాలు వంటి అరి వీర భయంకర హిట్ తర్వాత నవీన్ మరో సినిమా చేయలేదు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలే రెండేళ్లు స్క్రీన్పై కనబడక పోతే వాళ్ల సినిమాలు వస్తున్న సంగతే మర్చిపొతుంటారు. అలాంటిది అప్ కమింగ్ హీరో నవీన్ లాంటి వారు ఏటా ఓ సినిమాలో కనిపిస్తేనే వాళ్ళ సినిమాలు అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది. నవీన్ దురదృష్టం ఎలా ఉందంటే.. జాతి రత్నాలు టైమ్లోనే రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అవి రెండూ ఇప్పటివరకు పూర్తి రిలీజ్ కాలేకపోయాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట ప్రకటించిన అనగనగా ఒక రాజు సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం.
ఈ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కంటే ముందే పట్టాలెక్కించాడు. ఏడాది కిందట సినిమా తాలుకూ టైటిల్ టీజర్ను కూడా రిలీజ్ చేశాడు. దానికి సూపర్ రెస్పా్న్స్ కూడా వచ్చింది. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న తర్వాత అవుట్ పుట్ విషయంలో నవీన్ సాటీస్ఫై అవ్వలేడట. దాంతో దర్శకుడిని మార్చినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. కానీ ఇప్పుడీ సినిమా ఆ దర్శకుడి చేతిలో లేదని ఇన్సైడ్ టాక్. అయితే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సితార సంస్థ అతనితో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. మ్యాడ్ అనే కాలేజీ కుర్రాళ్లతో ఓ సినిమా రూపొందించారు.
ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. పలు సినిమాల తాలుకూ థీమ్లు గుర్తొచ్చినా.. లోపల కంటెంట్ కొత్తగా ఉంటే మట్టుకు హ్యాపీడేస్ రేంజ్లో హిట్టవడం ఖాయం. కాగా ప్రస్తుతం అనగనగా ఓ రాజుకు బ్రేకులు పడ్డాయట. వీలైనంత త్వరగా కొత్త దర్శకుడిని ఈ ప్రాజెక్ట్లోకి స్వాగతించాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు నవీన్ కొత్త సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి వచ్చే వారం రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై చెప్పుకోదగ్గ హైప్ లేదు. టీజర్, ట్రైలర్లు సైతం ఆహా ఓహో అనే రేంజ్లో లేవు. ప్రమోషన్లు సౌండ్ కూడా వినిపించడం లేదు. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మహేష్బాబు పచ్చగొల్ల దర్శకుడు.