నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మహేష్ బాబు.పి. దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని చేశాం. రెండున్నర నిమిషాల ట్రైలర్లో మేము కొంత ఎంటర్టైన్ చేయగలిగాం. రేపు థియేటర్లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా వుంటుంది.
పెళ్లితో పాటు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా వుంటుంది అనేది చూపిస్తున్నాం. యూనిక్ పాయింట్తో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ “జాతిరత్నాలు’ హిట్ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలని ఒత్తిడికి గురయ్యాను. చాలా కథలు విన్నాను. ఆ క్రమంలోనే దర్శకుడు మహేష్ ఈ కథ చెప్పాడు. వినగానే ఎంతో నచ్చింది. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్ కామెడీతో పాత్రతో ఇలాంటి ఫుల్లెంగ్త్ సినిమా తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఈ చిత్రంలో వుండే యూనిక్ పాయింట్ అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్తో పాటు నటుడు మహేష్ పాల్గొన్నారు.