తిరువనంతపురం: మలయాళీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నేదుముడి వేణు ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్ల నుంచి కాలేయ సంబంధిత రుగ్మతలతో ఆయన చికిత్స పొందుతున్నారు. థియేటర్ ఆర్టిస్టుగా ఆయన తన కెరీర్ను ప్రారంభించారు. థంబు సినిమాలో ఆయన చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. మలయాళం, తమిళంలో సుమారు 500 సినిమాల్లో నటించారు. అనేక చిత్రాల్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లతో వేణు ఆకట్టుకున్నారు. సీరియస్ నటనతో పాటు.. కామిడీ పాత్రల్లోనూ ఆయన అలరించారు. అరవం, విదపారాయుమ్ మున్పే, కల్లన్ పవిత్రన్, చామరం, భారతం, ఒరు మిన్నమినుగ్నైట్, నురుగువేత్తం, చిత్రం, తెన్మావిన్ కంబాద్, హిజ్ హైనెస్ అబ్దుల్లా, మార్గం, అరింపర చిత్రాల్లో ఆయన నటించారు. నేదుముడి వేణి మూడు జాతీయ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు. ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. కొన్ని సినిమాలకు వేణు స్క్రీన్రైటర్గా ఉన్నారు. నటనతో పాటు మృదంగం వాయించడంలోనూ వేణు దిట్ట.