సాయికుమార్, సాయిశ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతికుమార్ తుర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ క్లాప్నిచ్చారు. కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నానని దర్శకుడు తెలిపారు.