Malli Pelli | సీనియర్ నటుడు నరేష్, పవిత్రాలోకేష్ గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నరేష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో ఆయనకు జోడీగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. ఎం.ఎస్.రాజు దర్శకుడు. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘కుటుంబ కథా చిత్రమిది. నరేష్, పవిత్రాలోకేష్ జోడీ ప్రధానాకర్షణగా ఉంటుంది. వినోదం, భావోద్వేగాలు కలబోతగా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. జయసుధ, శరత్బాబు, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్ రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్: అరుల్ దేవ్, ఎడిటర్: జునైద్ సిద్ధిక్, పాటలు: అనంత శ్రీరామ్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.