నరేష్ వీకే, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ వీకే నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం వెల్లడించింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు ఎంఎస్ రాజు చెబుతున్నారు. జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎంఎన్ బాల్రెడ్డి, సంగీతం : సురేష్ బొబ్బిలి.