బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు రికార్డ్ లెవల్లో రూపొందుతున్నాయి. పలు ప్రాజెక్ట్స్తో ప్రభాస్ బిజీ ఉండగా, ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు.
ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా కనిపించి అలరించనున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గురు పూర్ణిమ రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నట్టు సమాచారం.
నాని, విజయ్ దేవరకొండ.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కథ ప్రకారం.. ఒక కాలం నుంచి మరో కాలానికి వెళ్లే ప్రభాస్కు భూత కాలంలో ఓ క్యారెక్టర్ ఉండనుంది. మరి భవిష్యత్తులో మరో ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఈ పాత్రలను స్టార్ హీరోలు చేస్తే ఈ సినిమా కథకు మరింత బాగుంటుందనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్.. నాని, విజయ్ దేవరకొండను కలిసి కథ వివరించగా, వారు దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.