Nandamuri Tarakaratna | నేడు కుప్పం నియోజక వర్గం కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో చికిత్స కోసం హుటాహుటినా కుప్పం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యపరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు.
నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితి కొంత విషమంగానే ఉందనిబుచ్చయ్య చౌదరి తెలిపారు. బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్లే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఎలాంటి స్టంట్లు వేయలేదు. తారకరత్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. తారకరత్నకు యాంజియో గ్రామ్ పూర్తయింది. అవకాశం ఉంటే ఆయనను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో బెంగళూరుకు తరలిస్తామన్నారు.