Nandamuri Suhasini | నందమూరి హరికృష్ణ నలుగురు సంతానంలో సుహాసిని ఒకరు. ఆమె 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆమెకు హార్ష అనే ఒక కొడుకు ఉన్నాడు. ఆయన వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌళిలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక జరిగింది. మేనమామలు తారక్, కళ్యాణ్రామ్లు హర్ష పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
ఇక వివాహ మహోత్సవంలో ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లే హైలేట్ అయ్యారు. తారక్ బ్లూ కలర్ పైజామా ధరించగా.. కళ్యాణ్ రామ్ డిజైన్తో ఉన్న వైట్ కలర్ పైజామా వేసుకున్నాడు. పెళ్లిలో వీరిద్దరు చాలా అట్రాక్షన్గా కనిపించారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నందమూరి బాలయ్యతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ కూడా పెళ్లిలో సందడి చేశాడు.