tarakaratna | అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు నందమూరి తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బంధుమిత్రులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం మోకిళ్లలోని ఆయన స్వగృహం నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్కు తీసుకొచ్చారు. అక్కడ సాయంత్రం వరకు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో వెంకటేష్, కుటుంబ సభ్యులు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు, నందమూరి రామకృష్ణ తదితరులు తారకరత్నకు నివాళులు అర్పించారు. ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు.