Urvasivo Rakshasivo Movie Pre-Release Event | కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నాఅల్లు శిరీష్ కమర్షియల్ హిట్ సాధించలేకపోతున్నాడు. 2019లో వచ్చిన ‘ఏబీసీడి’ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ను ప్రకటించారు. ఇక ఇటీవలే టైటిల్ పేరునూ మారుస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్రబృందం గ్రాండ్గా ప్లాన్ చేస్తుందట. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు బాలయ్య బాబును గెస్ట్గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలే రిలీజైన టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. శిరీష్కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. అనూప్రూబెన్స్, అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన దీంతనన, మాయరే పాటలకు విశేష స్పందన వచ్చింది.