నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. యథార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని, బాలకృష్ణ ఇమేజ్కు సరిపోయే విధంగా దర్శకుడు ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశారని, భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి అంశం హైలైట్గా వుంటుందని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.